BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
అప్పుడు జగన్ కోసం మంత్రివర్గం నుంచి తప్పుకొన్నారు.. ఇప్పుడు రేవంత్ తప్పించారు
కొండా మురళి గ్రామ సర్పంచిగా తన రాజకీయ జీవితం ప్రారంభించి ఎమ్మెల్సీగా పనిచేశారు. కొండా సురేఖ స్థానిక సంస్థల నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఎమ్మెల్యే, తరువాత మంత్రి అయ్యారు.
కొండా సురేఖ: మంత్రి వర్గం నుంచి తప్పిస్తూ రేవంత్ రెడ్డి నిర్ణయం.. బర్తరఫ్ తరువాత సురేఖ ఏమన్నారు
సెప్టెంబరు 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ వెళ్లారు. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే విషయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ర్ట వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చర్చించారు.
మూత్రాశయ క్యాన్సర్లను గుర్తించేందుకు ఇంట్లోనే పరీక్షలు
సిస్టోస్కోపీస్కి ఈ మూత్ర పరీక్షలు ప్రత్యామ్నాయం కాదు. అయితే ఏ రోగికి అధిక ముప్పు పొంచి ఉంది? ఎవరికి అత్యవసర చికిత్స అవసరం? అని తేల్చడంలో వైద్యులకు అవి ఉపయోగపడవచ్చు.
‘నిండు గర్భిణి’కి సిజేరియన్ చేస్తుండగా ఆమె కడుపులో బిడ్డే లేదని గ్రహించారు
కరాచీలోని హమ్దార్ద్ ఆస్పత్రిలో 2026 ఆగస్టు 27న ఈ మహిళకు ఆపరేషన్ చేశారు. ఆ సమయానికి ఆ మహిళకు 9 నెలలు పూర్తయ్యాయని, ఆమె కుటుంబం నమ్మింది. వారి వద్ద ఆమె 38 వారాల గర్భంతో ఉన్నట్లు ఆల్ట్రాసౌండ్ రిపోర్టు కూడా ఉంది. కానీ, సర్జరీ తర్వాత.. ఆమె కడుపులో అసలు బిడ్డే లేదని వైద్యులు చెప్పారు.
50 ఏళ్ల తర్వాత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమా? ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి?
50 ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, అవసరమైన పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్ హిమానీ, రేడియేషనల్ ఆంకాలజిస్ట్ చెబుతున్నారు. అందుకు కారణాలనూ ఆమె వివరించారు. అవేంటో ఈ కథనంలో చదవొచ్చు.
గొల్లగుప్పలో ఏడేళ్ల బాలిక మరణానికి మలేరియా మాత్రల మోతాదే కారణమా, అసలేం జరిగింది?
మలేరియా నివారణ చర్యల్లో భాగంగా గ్రామంలోని 71 మందికి క్లోరోక్విన్ మాత్రలు ఇచ్చినట్లు పోలవరం జిల్లా వైద్యాధికారిణి విష్ణు చైతన్య బీబీసీకి తెలిపారు. అక్కడి పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు కూడా వైద్య సిబ్బంది మాత్రలు ఇచ్చారని తెలిపారు.
నేపాల్ వరదలు: ‘‘సొరంగంలో తరుముకొస్తున్న వరద నుంచి బయటపడటానికి 20 నిమిషాలు పరిగెత్తా’’
సుమారు 30 మందితో కూడిన బృందం సొరంగంలో కాంక్రీట్ కోటింగ్ పనుల్లో నిమగ్నమై ఉండగా, అకస్మాత్తుగా వీచిన బలమైన ఈదురుగాలులతో ఇదంతా ప్రారంభమైందని పెమ్బాథున్ తమాంగ్ గుర్తు చేసుకున్నారు. బలమైన ఈదురుగాలులకు అక్కడి సామాగ్రి ఎగిరిపోయింది. బరువైన యంత్రాలు బోల్తా పడ్డాయి.
రివ్యూ: రోమాంచకం సినిమా ఎలా ఉంది, సుమంత్ ప్రభాస్, అనంతిక మ్యాజిక్ చేశారా?
ఈ కాలం పిల్లలు ఆన్లైన్లోనే ప్రేమించుకుని, ఆన్లైన్లోనే విడిపోతున్నారు. నాన్ సీరియస్గా, నాన్ సింక్లో మాట్లాడడం చేస్తున్నారు. ఈ పాయింట్ని దర్శకుడు వేణుగోపాల్రెడ్డి కరెక్ట్గానే పట్టుకున్నాడు. కానీ తెరమీదకి వచ్చేసరికి ఆయనకి జాతిరత్నాలు పూనింది.
నర్సు హత్య కేసు: బైక్ మెకానిక్ సహా నలుగురిని అనుమానించిన పోలీసులకు బైక్ మెకానిక్కే నిందితుడని ఎలా తెలిసింది?
'అర్ధరాత్రి 12-2 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. అతను లోపలకు రావడంతో యువతి కేకలు వేసింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో నిందితుడు సనావుల్లా ఆమెను కొట్టగా..అపస్మారక స్థితిలోకి చేరుకుంది. తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు సనావుల్లా విచారణలో చెప్పాడు' అని డీసీపీ రాజేశ్ చెప్పారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్లో
ఫీచర్లు
ఆరుతరాల అరుదైన ఉమ్మడి కుటుంబం: రోజుకు బస్తా బియ్యం, పండగొస్తే 2 పొట్టేళ్లు, 20 కేజీల చికెన్.. కలిసిమెలిసి ఎలా జీవనం సాగిస్తున్నారంటే..
అనంతపురం జిల్లాలో 83 మంది ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తున్న అరుదైన ఉమ్మడి కుటుంబం కథ ఇది. రోజుకు 50 కేజీల బియ్యం వంట, ఆదివారం వస్తే పొట్టేలు కోయాల్సిందే, సరదాగా బజ్జీలు తినాలంటే 15 కేజీల పిండి సిద్ధం చేయాల్సిందే. ఆధునిక కాలంలో ఎలాంటి విభేదాలు లేకుండా వీరంతా ఎలా కలిసి ఉంటున్నారు? ఆ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే..
గదర్ పార్టీ: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఈ గ్రూప్కు, ఇరాన్కు ఉన్న అనుబంధం ఏంటి?
"చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు తమ భద్రత కోసం ఇరాన్కు వెళ్లి అక్కడి నుంచే పోరాటాన్ని కొనసాగించేవారు. షిరాజ్లో జరిగిన ఒక ఎన్కౌంటర్ తర్వాత అంబా ప్రసాద్ తన ఎడమ చేతితోనే రివాల్వర్ను పట్టుకుని తనపై దాడి చేసిన వారిని ఎదుర్కొన్నారు’’
తాజ్మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.























































