ఒంటిగంట సమయానికి తమిళనాడులో 56.81, పశ్చిమ బెంగాల్లో 62.18 శాతం ఓటింగ్
పశ్చిమ బెంగాల్లోని 152 స్థానాలకు, తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది.
ఎలక్షన్ కమిషన్ గణాంకాల ప్రకారం, మధ్యాహ్నం 1 గంట వరకు బెంగాల్లో 62.18 శాతం, తమిళనాడులో 56.81 శాతం ఓటింగ్ నమోదైంది.
బెంగాల్లో కొన్నిచోట్ల చెదురుమదురు ఘటనలు చోటుచేసుకోగా, తమిళనాడులో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా డోమ్కల్లో టీఎంసీ, సీపీఎం కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. ఝర్గ్రామ్లోని ఒక పోలింగ్ కేంద్రంలోకి అడవి ఏనుగు రావడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.